Bhiknoor | భిక్కనూరు, జూన్ 8 : భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందం అవగాహన అవగాహన కల్పించింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. బ్యాంకు అధికారులు, పోలీసులు కూడా ఓటీపీలు అడగరని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జీలు హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో షీటీమ్ డబ్ల్యూపీసీ సౌజన్య, గ్రామ సర్పంచ్ దేవన బోయిన వాణి-వాసుయాదవ్, ఉపసర్పంచ్ ప్రకాష్ గౌడ్,వార్డు సభ్యులు, ప్రజలు, పాఠశాల హెడ్మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.