ఎడపల్లి (శక్కర్నగర్), డిసెంబర్ 9: రైతులు యాసంగిలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని మండల వ్యవసాయ విస్తీర్ణాధికారి బిల్ల సప్తగిరి సూచించారు. గురువారం ఎడపల్లి మండలంలోని జంలం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన రైతులకు సూచనలు చేశారు. అనంతరం యాసంగిలో పండించే ఆరుతడి పంటలకు చెందిన వాల్పోస్టర్లు, పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి గ్రామ కో- ఆర్డినేటర్ మల్లిక , రైతులు ప్రభాకర్, గేటు సాయిలు, తోట శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.
పంట మార్పిడిపై రైతులకు అవగాహన
యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేసుకోవాలని ఏఈవో గంగాజాల సూచించారు. గురువారం బోధన్ మండలంలోని రాజీవ్నగర్ తండాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంట మార్పిడిపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రైతులు వేరుశనగ, మినుములు, శనగ తదితర పంటలను సాగు చేసుకోవాలని సూచించారు.