కోటగిరి, అక్టోబర్ 1: ప్రజల ఆశీర్వాదంతో మూ డోసారి కేసీఆరే సీఎం కావడం ఖాయమని, బీఆర్ఎస్తోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పొతం గల్ మండలం కల్లూర్ గ్రామంలో రూ.8 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి ఆదివారం శంకుస్థాపన, ప్రారం భోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానం లో ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 4.70 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిని నింపి రెండు పంటలకు సాగు నీటికి ఢోకా లేకుండా చేశారని తెలిపారు. నియోజకవర్గంలో పెద్దమొత్తంలో అభివృద్ధి చేస్తుం టే .. ఇతర పార్టీల నాయకులు రాజకీయం, అల్లరి చేస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. మనస్సు నొప్పించే పని చేయవద్దన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్ల పేరిట దోపిడీ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథ కం పేరిట ఆ పార్టీ నాయకులు ఇండ్లు కట్ట కుండానే కోట్ల రూపాయల బిల్లులు తినేశారని మండిపడ్డారు. ఒక్క కల్లూర్ గ్రామంలోనే 252 ఇందిరమ్మ ఇండ్లు కట్టినట్లు రికార్డులు చూపించి.. కాంగ్రెస్ నాయకు లు, అధికారులు కుమ్ముక్కై రూ.2 కోట్లు మింగేశారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక పక్క నియోజకవర్గంలో కేవలం 14 వందలు డబుల్ బెడ్ రూం ఇండ్లు వస్తే బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ ఇండ్లు నిర్మించి అర్హులకు పంపిణీ చేశామన్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరు చేస్తానని తెలిపారు. ఈసందర్భంగా కల్లూర్లో 58 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.
బాన్సువాడలో ఆర్యవైశ్య సంఘ భవన ప్రారంభోత్సవం
బాన్సువాడ, అక్టోబర్ 1: బాన్సువాడ పట్టణంలో రూ. కోటితో నిర్మించిన ఆర్యవైశ్య భవనాన్ని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఆ సమయంలో బాన్సువాడ ఆర్యవైశ్యులు తమ సంఘానికి నిధులు కావాలని కోరుతూ అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి వద్దకు వెళ్లి వినతి పత్రాన్ని ఇవ్వగా.. చెత్తకుప్పల్లో పడేశారని గుర్తుచేశారు. అప్పట్లో ఒక్కో ఎమ్మెల్యేకు నియోజక వర్గానికి కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే సీడీపీ నిధులు ఇచ్చే వారని తెలిపారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో భారీగా నిధులు మంజూరుచేయడంతో బాన్సువాడ నియోజక వర్గంలోరూ. కట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. బాన్సువాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల4వ తేదీన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, ఈ నేపథ్యంలో ఆర్యవైశ్యులు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.