బోధన్, ఫిబ్రవరి 19: ఈనెల 20న బోధన్కు రావాల్సిన నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ రాక వాయిదా పడింది. నిజాంషుగర్స్ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మంగళవారం శక్కర్నగర్లోని కర్మాగారాన్ని పర్యవేక్షించేందుకు వస్తుందని, చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు.
కమిటీ రాక వాయిదా పడినట్లు సోమవారం సాయంత్రం అధికారులు తెలిపారు. కమిటీ తిరిగి ఎప్పుడు వస్తుందనేది త్వరలోనే ప్రకటిస్తారని వారు పేర్కొన్నారు.