డిచ్పల్లి, ఫిబ్రవరి 2: డిచ్పల్లి మండల కేంద్రంలోని జీ కన్వెన్షన్లో ఈనెల 5న బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి నిర్వహించనున్నట్లు ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నారని పేర్కొన్నారు. పార్టీ నేతలకు టోల్ప్లాజా నుంచి భారీ ర్యాలీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశానికి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు