ఆర్మూర్/ మెండోరా/ ఏర్గట్ల/ బోధన్ రూరల్, జనవరి16 : ఆర్మూర్ మండలంలో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత సూచించారు. మండలంలోని 33, 1, 4వ వార్డుల్లో 19న ప్రారంభమయ్యే కంటి వెలుగు కేంద్రాల ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు సోమవారం పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మెండోరా మండలంలోని పోచంపాడ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ మిస్బా, ఉపసర్పంచ్ సంపంగి సతీశ్, డాక్టర్ రాకేశ్, హెచ్ఈవో సురేశ్, మురళీ, సెక్రటరీ భోజన్న పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో కంటి వెలుగు ఏర్పాటుకు స్థానిక రైతు వేదిక కేంద్రాన్ని కేటాయించారు.
ఈ సందర్భంగా కేంద్రంలో చేపడుతున్న ఏర్పాట్లను మండల వైద్యాధికారిణి ప్రసన్నప్రియ, ఎంపీడీవో కర్నె రాజేశ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మహ్మద్ అబ్దుల్ మాలిక్, ఏపీఎం శ్యామ్, ఎంపీవో శివచరణ్, హెల్త్ అసిస్టెంట్ పండరి, ఏఎన్ఎం, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు. సాలూర మండల కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోధన్ ఎంపీడీవో మధుకర్ సిబ్బందికి సూచించారు. అనంతరం కంటి వెలుగు పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ, రైతు బంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దెరాజేశ్వర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.