ఎల్లారెడ్డి రూరల్, మార్చి 8: ఎల్లారెడ్డి పట్టణం కోదండరామాలయంలోని మెట్లబావి, నీలకంఠేశ్వరాలయంలోని నందీశ్వర విగ్రహాలను పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బృందం శుక్రవారం సందర్శించింది. ఈ సందర్భంగా రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఎండీ కల్పనా రమేశ్ మెట్ల బావి పునరుద్ధరణ పనుల వివరాలను వారికి వివరించారు. సంప్రదాయ సున్నపురాయితో శిథిలమైన భాగాల్ని అనుభవజ్ఞులైన శిల్పులతో చేపడతామని, వానకాలంలోపు పనులు పూర్తవుతాయని తెలిపారు.
నాలుగు వందల ఏండ్ల చరిత్ర గల మెట్లబావిని ఎమ్మెల్యే మదన్మోహన్రావు, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా పునరుద్ధరణ పనులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఆర్డీవో మన్నె ప్రభాకర్, ఆలయ ధర్మకర్త సిద్ధి శ్రీధర్ తదితరులు ఉన్నారు.