వేల్పూర్: వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఆవరణలో అభయాంజనేయ స్వామి 12 అడుగుల విగ్రహ ఏర్పాటకు బుధవారం ఆలయ కమిటీ సభ్యులు భూమి పూజ నిర్వహించారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు విద్యాసాగర్రెడ్డి సహకారంతో విగ్రహ ఏర్పాటు జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో విగ్రహ దాత విద్యాసాగర్రెడ్డి, ఎంపీటీసీ గంగామణి, సొసైటీ ఉపాధ్యాయులు శ్రీధర్, ఆయల కమిటీ అధ్యక్షుడు బట్టు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ తిరుమల, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.