జక్రాన్పల్లి, ఫిబ్రవరి 4 : మండలంలోని కొలిప్యాక్ గ్రామశివారులో ఉన్న ఆనందగిరి లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి అభిషేక కార్యక్రమాలతోపాటు కొండ ప్రదక్షిణ, కల్యాణం తదితర కార్యక్రమాలు చేపట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యురాలు తనూజా శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ దీకొండ హరితాశ్రీనివాస్, సర్పంచ్ గంగూబాయి బాల్రాజ్ స్వామివారికి కానుకలను సమర్పించారు. ఆదివారం రథోత్సవం, సోమవారం పూర్ణాహుతి, చక్రతీర్థం, మంగళవారం డోలారోహణ సేవ, కొండబలితో ఉత్సవాలు సంపూర్ణ మవుతాయని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లచ్చారాం, రవి, సుధీర్రెడ్డి, మోహన్, లింగం, కిషన్, గంగాధర్తో పాటు గ్రామపెద్దలు సంతోష్, ఆరేపల్లి గంగాధర్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నేటి నుంచి నల్లగుట్ట నర్సింహస్వామి
ధర్పల్లి, ఫిబ్రవరి 4 : మండలంలోని దుబ్బాక గ్రామ పరిధిలో ఉన్న శ్రీ నల్లగుట్ట నర్సింహస్వామి ఆలయ జాతర, ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయని, ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ జి.అశోక్, ఎంపీటీసీ సభ్యుడు పెండ గంగాధర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కోతి శేఖర్రెడ్డి, గ్రామపెద్దలు తెలిపారు. మూడురోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. శనివారం రాత్రి నర్సింహస్వామి విగ్రహం గుట్టపైకి చేరుకోవడంతోఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. స్వామివారి కల్యాణం, రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.