నిజామాబాద్ క్రైం, ఆగస్టు 20 : నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 102 మద్యం షాపులకు 2023-25 సంవత్సరానికి నిర్వహించిన టెండర్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. అధికారుల అంచనాలను తారుమారు చేస్తూ మున్నుపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్య లో టెండర్లు వచ్చాయి. లిక్కర్ షాపులను నేడు జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో గల రాజీవ్గాం ధీ ఆడిటోరియంలో కేటాయించనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, సూపరింటెండెంట్ మల్లారెడ్డితో కలిసి ‘డ్రా పద్ధతి’ ద్వారా ఎంపిక చేస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. తమను ఎలాగైనా అదృష్టం వరిస్తుందని వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2021-23లో జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం షాపులకు 1,762 దరఖాస్తులు వచ్చాయి. నూతన మద్యం పాలసీలో నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 35 షాపులకు 1518, బోధన్ పరిధిలోని 18 షాపులకు 518, ఆర్మూర్ పరిధిలోని 26షాపులకు 834, భీమ్గల్ పరిధిలోని 12 షాపులకు 430, మోర్తాడ్ పరిధిలో 11షాపులకు 459 మొత్తం 3,783 టెండర్లు దాఖలయ్యాయి. ఒక్కో షాపునకు స గటున 37 దరఖాస్తులు వచ్చాయి.
అత్యధిక దరఖాస్తులు వచ్చిన దుకాణాలు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని-2వ డివిజన్ మానిక్బండార్ వైన్స్కు అత్యధికంగా 112 అప్లికేషన్లు వచ్చాయి. మోపాల్ మండల వైన్స్కు 110, ఏర్గట్ల వైన్స్కు104 అప్లికేషన్లు వచ్చాయి.
హైదరాబాద్ హెల్ప్డెస్క్లో సైతం దరఖాస్తులు
ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం షాపులకు ఇతర ప్రాంతాల నుంచి సైతం టెండర్లు వేసేందుకు ఎక్సై జ్ శాఖ వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్లోనూ నిజామాబాద్లోని లిక్కర్ షాపులకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రత్యేకంగా ‘హెల్ప్ డె స్క్’ అందుబాటులో ఉంచారు. దీంతో దరఖాస్తుల స్వీకరణ చివరి రోజు నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 16, బోధన్ 6, మోర్తాడ్ పరిధిలో 2 మొత్తం 24 దరఖాస్తులు వచ్చాయి.
ఎన్నికల నేపథ్యంతోనే భారీగా టెండర్లు
2024లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలు ఉండడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తున్నది.
మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ
కామారెడ్డి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం షాపులకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఒక్కో షాపునకు సగటు 50 మంది పోటీ పడుతుండగా, వైన్స్ షాపు రూపంలో అదృష్టం ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠత వ్యాపారుల్లో నెలకొన్నది. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల రోడ్డులోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ చేతుల మీదుగా లక్కీ డ్రా తీయనున్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు తెలిపారు. జిల్లాలో 49 దుకాణాలకు 2174 దరఖాస్తులు వచ్చాయి. మద్యం వ్యాపారంలో ప్రవేశానికి వ్యాపారులు తహతహలాడుతున్నారు. రూ.2లక్షల చొప్పున డీడీ చెల్లించి అదృష్టం పరీక్షించుకుంటున్న వ్యాపారుల్లో లక్కీ డ్రాపై ఉత్కంఠ నెలకొన్నది. కామారెడ్డి స్టేషన్ పరిధిలో 744, దోమకొండ స్టేషన్ పరిధిలో 421, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 323, బాన్సువాడ స్టేషన్ పరిధిలో 343, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 343 దరఖాస్తులు వచ్చాయి.