పిట్లం/ నిజాంసాగర్, మార్చి 10: నిజాంసాగర్ మండలానికి ఈనెల 13న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఏర్పాట్లను పరిశీలించారు. పిట్లం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో కేటీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరిశీలించారు.అనంతరం బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతూ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. పార్కింగ్, సభాస్థలి వద్ద ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, నాయకులు విజయ్, అన్నారం వెంకట్రాంరెడ్డి, జొన్న శ్రీనివాస్రెడ్డి, నర్సాగౌడ్, జగదీశ్, ప్రతాప్రెడ్డి, బాబూసింగ్ తదితరులు ఉన్నారు.
నిజాంసాగర్ మండలం గోర్గల్ శివారులో కొనసాగుతున్న హెలిప్యాడ్ పనులతోపాటు మంజీరాపై నిర్మించిన వంతెన, నాగమడుగు మత్తడికి సంబంధించిన పైలాన్ వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెలిప్యాడ్ నుంచి ప్రధాన రహదారికి ప్రయాణించే రహదారిపై గుంతలు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. నాగమడుగు మత్తడి నిర్మాణం కోసం భూ సేకరణ నిమిత్తం కావాల్సిన భూమికి ప్రభుత్వం తరపున ఎకరాకు రూ.17లక్షలు ఇచ్చేలా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఒప్పించి తమకు న్యాయం చేసినందుకు కలెక్టర్కు రైతులు ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రమోహన్, నీటిపారుదల శాఖ ఎస్ఈ వాసంతి, ఈఈ సొలోమాన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, పండరి, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, తహసీల్దార్ నారాయణ, నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.