చందూర్, ఏప్రిల్ 17 : బీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా చందూర్ ఎంపీపీ లావణ్యా రాంరెడ్డి (కాంగ్రెస్)తోపాటు పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా.. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గులాబీ పార్టీలో చేరిన వారిలో ఘన్పూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సలీం, సొసైటీ డైరెక్టర్ బాలయ్యతోపాటు పులువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన అనంతరం ఎంపీపీ లావణ్యారాంరెడ్డితోపాటు మండలానికి చెందిన పలువురు నాయకులు.. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. సాయంత్రం బీఆర్ఎస్ నాయకుడు పోచారం సురేందర్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూడ్ అంబర్ సింగ్, సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్ , సర్పంచులు బోడ్డోల్ల సత్యనారాయణ, దాసరి గంగారాం, సొసైటీ మాజీ చైర్మన్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.