పిట్లం, డిసెంబర్ 19: మండలంలోని కంబాపూర్, మార్దండ గ్రామాలను ఏడీఏ నూతన్కుమార్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న ఆరుతడి పంటలను పరిశీలించారు. పంటలకు తెగుళ్లు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలను పాటిస్తూ పంటలను సాగుచేస్తే అధిక దిగుబడులను సాధించవచ్చని సూచించారు. పట్టాదారులైన రైతులందరూ ఈ-కేవైసీ నమోదు చేయించుకోవాలన్నారు. ఆయన వెంట ఏఈవో ప్రదీప్రెడ్డి, రైతులు ఉన్నారు.
నిజాంసాగర్, డిసెంబర్ 19: జుక్కల్ మండలంలోని నాగల్గావ్ గ్రామ శివారులో రైతులు సాగుచేస్తున్న పంటలను మండల వ్యవసాయాధికారి నవీన్కుమార్, సర్పంచ్ కపిల్ పాటిల్ పరిశీలించారు. శనగ, జొన్న, మక్కజొన్న, కొత్తిమీర పంటల్లో సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. పంటలకు చీడపీడలు పిచికారీ చేయాల్సిన మందులపై అవగాహన కల్పించారు.