నిజామాబాద్ స్పోర్ట్స్, డిసెంబర్ 27: ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు స్వీకరణ కోసం నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభం కానున్నది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామాలు, వార్డుల వారీగా సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం అమలు తీరును జిల్లా స్థాయిలో పరిశీలించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారిగా క్రిస్టినా జడ్ చోంగ్తును నియమించారు.