నిజామాబాద్ క్రైం,జనవరి 1 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఆదివారం అర్ధరాత్రి అనంతరం రెండు గ్యాంగులకు చెందిన యువకులు ఒకరినొకరు దూషించుకోవడం ఘర్షణకు దారి తీసింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆర్యనగర్, ఇంద్రాపూర్ కాలనీ, వినాయక నగర్, కోటగల్లీ ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది యువకులు గొడవకు దిగారు. ముందుగా వినాయకనగర్ ప్రాంతంలో పరస్పరం దాడులు చేసుకున్న యువకులు అక్కడి నుంచి 100 ఫీట్ల రోడ్డు అనంతరం కోటగల్లీ ప్రాంతాల్లో రెండు గ్యాంగులకు చెందిన యువకులు కర్ర లు, రాడ్లతో కొట్టుకున్నారు.
ఈ దాడుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. సోమవారం రోజు ఓ గ్యాంగ్కు చెందిన యువకులు సం బంధిత నాల్గోటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడుల్లో ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే దాడులు చేసుకున్న యువకులను గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.