మెండోరా, జూన్ 26 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు 4,572 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 50 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1066.20 అడుగుల (22.248 టీఎంసీలు) వద్ద ఉన్నదని ఏఈఈ తెలిపారు.