ముంబై: తౌక్టే తుఫాన్ వల్ల ఆరేబియా సముద్రంలో ఉన్న బార్జ్లు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. పీ305 బార్జ్ మునిగిన ఘటనలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే ఆరేబియా తీరంలో సుమారు 14 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఇక తౌక్టే ధాటికి గుజరాత్లో కూడా 33 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. బీభత్సం సృష్టించిన గుజరాత్ రాష్ట్రాన్ని ఏరియల్ సర్వే చేసేందుకు ఇవాళ ప్రధాని మోదీ బయలుదేరారు. ప్రస్తుతం పీ305 బార్జ్ నుంచి 184 మందిని రక్షించారు. ఇంకా ఆ బార్జ్లో ఎంత మిస్సయారన్న విషయం తెలియదు. అయితే బార్జ్ పీ305కి చెందిన 78 మంది ఇంకా మిస్సింగ్లో ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.