హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను యథాతథంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, హైకోర్టు సూచనల మేరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింపుపై ఉద్దేశాన్ని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల నిర్వహణకు కొవిడ్-19 నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేస్తామని, ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం తమను కోరిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీ పార్థసారధి తెలిపారు. గురువారం అధికారులతో చర్చించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. పోటీచేసే పార్టీలు, అభ్యర్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే ప్రచారం నిర్వహించాలని స్పష్టంచేశారు. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ముగించాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారమే 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది.
ఎన్నికల నిర్వహణ, ప్రచారంలో కొవిడ్ నిబంధనలు