న్యూఢిల్లీ : సిగరెట్లు తాగడాన్ని తగ్గించడంలో భాగంగా వదులుగా సిగరెట్ల అమ్మకం నిలిపివేయడాన్ని మెజార్టీ సిగరెట్ స్మోకింగ్ ప్రియులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్యాకెట్లు కొనడం మరింత ఎక్కువై ధూమపానం పెరగడం ఖాయమంటున్నారు వాళ్లు.
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై చట్టంలోని సవరణలపై సిగరెట్ తాగేవారు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునేందుకు వాణిజ్యేతర సంస్థ ప్రహార్.. ఒక సర్వే చేపట్టింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, గువాహటి, వడోదర నగరాలతోపాటు 14 నగరాల్లో సర్వే నిర్వహించారు.
సిగరెట్ తాగడానికి ప్రస్తుతం అనుమతిస్తున్న వయసును 18 నుంచి 21 ఏండ్లకు పెంచడాన్ని కూడా 78 శాతం స్మోకింగ్ ప్రియులు మద్దతు ఇవ్వలేదు. అలాగే, సిగరెట్లను వదులుగా కాకుండా ప్యాకెట్ మొత్తంగా అమ్మకాలు జరుపడాన్ని 87 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఇది ధూమపానాన్ని మానుకోవాలని చెప్పడం కన్నా పూర్తి ప్యాక్లు కొనుగోలు చేయమని బలవంతం చేస్తుందని, ఇది మరింత పొగాకు వినియోగం పెరుగుదలకు దారితీస్తుందని వారు భావిస్తున్నారు.
ఇదే సమయంలో సిగరెట్ తాగే అలవాటును తగ్గించుకోవడానికి వదులుగా అమ్మడంపై నిషేధం ఉపయుక్తంగా ఉంటుందని 57 శాతం మంది పేర్కొన్నారు. లూస్ సేల్స్ నిషేధిస్తే తాము పూర్తిగా సిగరెట్లు తాగడం మానుకునేందుకు ఉపయోగపడుతుందని కేవలం 7 శాతం మంది తెలిపారు.
పొగాకు వినియోగం కోసం వయస్సును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచడాన్ని 78 శాతం మంది మద్దతు ఇవ్వలేదు. 37 శాతం మంది పొగాకును వినియోగించాలా? వద్దా? అని నిర్ణయించుకోవడం తమ ప్రాథమిక హక్కు అని చెప్పారు. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి సిగరెట్లు అమ్మకూడదనుకోవడం వారు అక్రమ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తుందని 8 శాతం మంది అభిప్రాయపడ్డారు.
2030 కల్లా ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
పుతిన్కు వ్యాక్సిన్.. ఫొటో విడుదల చేయకపోవడంపై అనుమానాలు
రైల్వే ప్లాట్ఫాంపై ఏనుగు.. పరుగులు తీసిన ప్రయాణికులు
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
25 ఏండ్ల క్రితం వీకీవీకీవెబ్ ప్రారంభం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..