ఎన్నికల ప్రచారం ముగిసింది. నెలరోజులుగా మార్మోగిన మైకులు, డీజేలు మూగబోయాయి. రేపటి ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. మద్యం షాపులు మూతబడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో దాదాపు అన్ని దుకాణాల్లో మద్యం స్టాక్ ఖాళీ అయింది. పల్లెలు, పట్టణాలను చుట్టేసిన రాజకీయ నేతలు మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగించారు. అసలు సిసలైన పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు.
ఖలీల్వాడి, నవంబర్ 28 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా కొన్ని రోజులుగా హోరెత్తించిన ప్రచార రథాలు, మైకులు, డీజేలు మూగబోయాయి. ఈ నెల 30న పోలింగ్ ఉండడం తో 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలన్న ఆదేశాల మేరకు వివిధ పార్టీల అభ్యర్ధుల మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచా రం చేశారు. రోడ్లపై డీజేలు, మైకులు మూగబోయా యి. దీంతో జిల్లా అంతటా నిశబ్దం ఆవరించింది. నెల రోజులుగా అభ్యర్థులు ప్రచారాలతో జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో సందడి చేశారు. జిల్లా లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్ర చారం చేశారు.
ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తారని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 24 గం టల విద్యుత్ సరఫరా, పెన్షన్ల పంపిణీ తదితర పథకాలు ఆయా నియోజకవర్గాలో చేపట్టిన అభివృద్ధి తమకు శ్రీరామరక్షగా నిలుస్తాయని వారు నమ్ముతున్నారు.
జిల్లాలో ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హ న్మంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ 144 సెక్షన్ వి ధించారు. జిల్లాలో మూడు రోజుల పాటు వైన్ షా పులు బంద్ ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఎ న్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక బృందాలతో పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్, కౌం టింగ్ ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు.
నిజామాబాద్ స్పోర్ట్స్, నవంబర్ 28:ఎన్నికల నేపథ్యంలో 30న పోలింగ్ సందర్భంగా ఓటర్లు ఓటుహక్కును విని యోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవును ప్రకటించిందని ఎన్నికల అధికారి రాజీవ్గాంధీ హన్మంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురు వారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, పరిశ్రమ లకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలుగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా వినియోగిస్తున్న విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ఈ నెల 29న కూడా సెలవు దినంగా ప్రకటించారు.