బోధన్, ఫిబ్రవరి 18: లక్ష్యంతో చదివితే విజయం వరిస్తుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ బాచుపల్లి క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్.కోటేశ్వరరావు అన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) గుర్తింపు లభించిందని, ఎన్ఐఆర్ఎఫ్ కేటగిరి – 1లో 28వ ర్యాంక్ పొందడంతో దేశంలోని అతి కొద్ది గొప్ప డీమ్డ్ యూనివర్సిటీల్లో ఒకటిదిగా తమ యూనివర్సిటీ నిలిచిందని పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని ఉషోదయ జూనియర్ కళాశాల క్యాంపస్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ – కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘ఇంటర్మీడియెట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలు’ అనే అంశంపై ‘లక్ష్యం – 2024’ పేరిట ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. మామూలు యూనివర్సిటీలకు, డీమ్డ్ యూనివర్సిటీలకు చాలా తేడా ఉందన్నారు. డీమ్డ్ యూనివర్సిటీలు విద్యార్థుల్లోని సృజనాత్మకత, ఆవిష్కరణల శక్తిని వెలుగులోకి తీసుకువస్తాయని పేర్కొన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో విద్యార్థులు చదివితే వారి కలలు సాకారం అవుతాయని, దేశంలో అత్యున్నత విద్యాప్రమాణాలతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న యూనివర్సిటీగా కేఎల్యూకు పేరు వచ్చిందన్నారు.
విద్యార్థులు తమ ఉన్నత చదవుల కోసం సరైన యూనివర్సిటీని ఎంపిక చేసుకోవాలని, ఆ యూనివర్సిటీలో క్రమశిక్షణ ఎలా ఉం ది.. క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్, ఉన్నత చదువులతో కూడిన ఫ్యాకల్టీ ఉందా లేదా.. తదితర అంశాలపై ఆలోచించాలని సూచించారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్, పరిశోధనలకు కేఎల్ విద్యావిధానంలో మంచి అవకాశం ఉందని, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రక్రియ డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ప్రారంభమవుతుందని, నాల్గో ఏడాదిలో ప్లేస్మెంట్ లభించి క్యాంపస్లో చదవకుండానే ఇంటర్న్షిప్ చేస్తూనే డిగ్రీని పూర్తిచేయవచ్చని వివరించారు. ఇంజినీరింగ్ మాత్రమే విద్యకాదని, బైపీసీ, కామర్స్ తదితర కోర్సులు తక్కువకాదని, అన్ని కోర్సులకూ డిమాండ్ ఉందని అన్నారు. ఏం చదవామన్నది కాకుండా ఎలా చదివామన్నది… విద్యార్థులకు ఏ కోర్సులో ఇష్టముంటుందో.. ఆ కోర్సును చిత్తశుద్ధితో పూర్తిచేస్తే వారు జీవితంలో రాణించగలుగుతారన్నారు. కేఎల్ యూనివర్సిటీలో బీపీసీ విద్యార్థులు సైతం ఇంజినీరింగ్ కోర్సులను అభ్యసించే అవకాశముందని డాక్టర్ అత్తున్నత విద్యార్హతలు కలిగిన ఫ్యాకల్టీ కేఎల్యూలో ఉందని, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
కేఎల్ యూనివర్సిటీలో నాలుగేండ్ల డిగ్రీ కోర్సులతో అమెరికా తదితర విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశం వెంటనే లభిస్తుందన్నారు. కేఎల్ యూనివర్సిటీలో చదువుకునేందుకు ‘విద్యాలక్ష్మి’ పోర్టల్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చని తెలిపారు. మెరిట్ విద్యార్థులకు తమ యూనివర్సిటీలో స్కాలర్పిష్లు ఇస్తున్నామన్నారు. సివిల్ సర్వీస్ పరీక్షలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కేఎల్యూలో ప్రత్యేకమైన అకాడమీ ఉందన్నారు. కేఎల్యూలో ఇంగ్ల్లిష్లోనే కాకుండా జపనీస్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ ఫారిన్ లాంగ్వేజీల్లో ఏదో ఒక లాంగ్వేజ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. టీ హబ్తో యూనివర్సిటీకి ఎంతో అనుబంధం ఉందన్నారు. 1980లో విజయవాడలో ప్రారంభమైన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో 50కు పైగా కోర్సులు ఉన్నాయని, 2018లో హైదరాబాద్లోని హజీజ్నగర్లో, 2023లో హైదరాబాద్లోని బాచుపల్లిలో యూనివర్సిటీ క్యాంపస్లు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు.
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఒకేసారి రెండు డిగ్రీలు చదివే అవకాశం ఉందని డాక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. ఈ డ్యూయల్ డిగ్రీలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. మల్టీ నేషనల్ కంపెనీల్లో డ్యూయెల్ డిగ్రీలు చదివినవారికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ‘లక్ష్యం-2024’ కార్యక్రమం ఏర్పాటుకు అవకాశం కల్పించిన ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ సూర్యప్రకాశ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవగాహన సదస్సులో ఉషోదయ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆనంద్రెడ్డి, ఉషోదయ జూనియర్ కళాశాల (బాలురు) ప్రిన్సిపాల్ ప్రసాద్, ‘నమస్తే తెలంగాణ’ సీనియర్ మేనేజర్ (ప్రకటనల విభాగం) కడార్ల శ్రీకాంత్, బోధన్ ఆర్సీ ఇన్చార్జి సాగిరాజు బలరామరాజు పాల్గొన్నారు.
అన్ని కోర్సులు మంచివేనని, ఏ కోర్సులో ఆసక్తి ఉంటే అదే కోర్సును విద్యార్థి ఎంపికచేసుకోవడమే కాకుండా, ఆ కోర్సును శ్రద్ధగా చదవాలని బోధన్ పట్టణంలోని ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ వి.సూర్యప్రకాశ్ అన్నారు. ఏ కోర్సు చదవామన్నది కాదు.. ఎలా చదవామన్నదే ప్రధానమని, అన్ని కోర్సులకు సమాజంలో డిమాండ్ ఉందని తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో చాలా విషయాలను తమ విద్యార్థులు తెలుసుకున్నారన్నారు. కేఎల్ యూనివర్సిటీలో వివిధ బ్రాంచ్లు ఉన్నాయని, ఎంపీసీనే కాకుండా ఆర్ట్స్, కామర్స్కు సంబంధించిన కోర్సులు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఈ అవగాహన సదస్సు ద్వారా తాము ఎంపికచేసుకునే కోర్సుల విషయమై ఒక అవగాహనకు వచ్చారన్నారు. ఒకప్పుడు చదువుకోవడం చాలా కష్టమని, ప్రస్తుతం చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మూస పద్ధతిలో డిగ్రీలు చదవడమన్నది లేదని, డిగ్రీలో ఒక కోర్సులోని విద్యార్థులు దానితో పాటే మరో కోర్సును చదవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. తమ విద్యాసంస్థల డిగ్రీ విద్యార్థులకు అన్ని యూనివర్సిటీల సం దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటుచేయబోతున్నామని, ఆ సందర్భంగా కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్కు కూడా వారిని తీసుకువస్తామని అన్నారు. తమ క్యాంపస్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీకి, వర్సిటీ బాచుపల్లి క్యాంపస్ ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు, ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి సూర్యప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు
ఉషోదయ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు ‘లక్కీ డ్రా’ నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో ఎం.కల్పన అనే అనే విద్యార్థిని ఎంపికవగా.. ఎల్.కోటేశ్వరరావు, వి.సూర్యప్రకాశ్ బహుమతిని అందజేశారు.
ఫస్టియర్ ఇంటర్మీడియెట్లో బాలికల విభాగంలో టాపర్గా నిలిచిన ఎన్.అంకిత, బాలుర విభాగంలో టాపర్గా నిలిచిన ఫర్హాన్లకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ తరఫున ఈ కార్యక్రమంలో బహుమతులను అందజేశారు.
మా కళాశాలలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సుతో మాకు ఎన్నో కొత్త కోర్సుల గురించి తెలిసింది. కొన్ని కోర్సుల విషయంలో సందేహాలు తొలగిపోయాయి. ఒకేసారి రెండు డిగ్రీలు చదవవచ్చన్న విషయం గతంలో మాకు తెలియదు. డ్యూయెల్ డిగ్రీల గురించి తెలుసుకున్నాం.
ఈ అవగాహన సదస్సు మాకు ఎంతో ఉపయోగపడింది. నాకు ఇంట్రస్ట్ ఉన్న ఒక కోర్సు గురించి అడిగి తెలుసుకున్నాను. దీంతో నా డౌట్ క్ల్లీయర్ అయింది. బోధన్లాంటి ప్రాంతంలో ఇటువంటి సదస్సు పెట్టడంతో నాలాంటి విద్యార్థినులకు ఎంతో ఉపయోగం జరిగింది. ఉన్నత చదువులపై ఉన్న భయం తొలగిపోయింది.
మా కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంతో మాకు డ్యూయెల్ డిగ్రీలపై అవగాహన కలిగింది. ఇది మంచి కార్యక్రమం.. ఇటువంటి సదస్సులతో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీ గొప్పతనం తెలుసుకున్నాం. భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండా లన్నదానిపై క్లారిటీ వచ్చింది.