వర్ని, అక్టోబరు 12: దళితుల ఆర్థికాభివృద్ధి కోసం అమలుచేస్తున్న దళితబంధు పథకం దేశానికి తలమానికంగా మారనున్నదని స్పీకర్ పో చారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ పథకాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేస్తారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేనే లేదని, బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. రాబో యే కాలానికి కూడా నిరంతరాయంగా విద్యుత్ను అందించే సత్తా మన రాష్ర్టానికి ఉందన్నారు. మంగళవారం ఆయన వర్ని మండలం శ్రీనగర్, వకీల్ఫారం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీనగర్లో 38 మంది లబ్ధిదారులకు మంజూరైన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గతంలో మంజూరై డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారురాలుతో గృహ ప్రవేశం చేయించారు. వంట గదిలో స్పీకర్ స్వయంగా పాలు పొంగించారు. అనంతరం రూ.15లక్షలతో నిర్మించనున్న దండోరా కమ్యూనిటీ భవనానికి ఆయన భూమి పూజ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.28లక్షలతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణ అనే వ్యక్తి తన తల్లి దండ్రులు వెంకటరత్నమ్మ-వెంకటరత్నం జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను స్పీకర్ ప్రారంభించారు. అనంతరం వకీల్ ఫారం గ్రామంలో రూ.15లక్షలతో చేపట్టిన కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు ఉండి ఉంటే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు కాదన్నారు. పరిపాలనా దక్షత కేవ లం సీఎం కేసీఆర్లోనే ఉందన్నారు. డీసీసీబీ చైర్మన్ పోచా రం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఎంపీపీ మేక శ్రీలక్ష్మీ వీర్రాజు, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, శ్రీనగర్ సర్పంచ్ రాజు, విండో అధ్యక్షుడు నా మాల సాయిబాబా, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.