నిజామాబాద్ రూరల్: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం నిర్మించేందుకు ఈనెల 2న (రేపు) ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేయనున్న సంగతి విదితమే. కాగా బుధవారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విమానంలో పయణమయ్యారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా తరలివెళ్లిన వారిలో ఉన్న్లారు.