డిచ్పల్లి: డిచ్పల్లి మండలంలోని అమృతపూర్ గ్రామ ఎంపీటీసీ దండుగుల సాయిలు, సాంపల్లి తండా ఉపసర్పంచ్ రమేశ్ నాయక్ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీటీసీ సాయిలుతో పాటు 50 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అందజేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, జెడ్పీటీసీ దాసరి ఇందిర లక్ష్మినర్సయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్రెడ్డి, సర్పంచులు జగదీశ్, తిరుపతి, తారాసింగ్, లింగంయాదవ్, ఖదీజా యూసుఫ్, ఎంపీటీసీలు రామకృష్ణ, రవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.