నిజామాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గులాబ్ తుపాన్ ప్రజల్లో గుబులు రేపుతున్నది. వాతావరణ శాఖ జారీ చేసి న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఉండేందు కు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకుంటూ తుపాన్ గండాన్ని గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో ప్రజలెవ్వరూ అనవసర ప్రయాణాలు చేయవద్దని అధికారు లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో చెరువులు మత్తడి పోస్తున్న దరిమిలా మరింత ప్రమాదకరమైన స్థితికి చే రే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారు లు చెబుతున్నారు. గ్రామాల్లోనూ చెరువు ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రమాదకరమైన స్థితి ఏర్పడితే అప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకునేందుకు ఉభయ జిల్లాల్లో యంత్రాం గం అప్రమత్తమైంది.
రెడ్ జోన్లో…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను వా తావరణ శాఖ రెడ్ జోన్గా నిర్ధారించింది. అంటే దాదాపు అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో వాతావరణ శాఖ రెడ్ జోన్గా నిర్ణయించించినట్లుగా తెలుస్తున్నది. ఆగస్టు నెలలోనూ బా ల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో కుండపోత వానలతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి పలు లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది. ఇప్పుడు కూడా ఇలాంటి స్థితి ఏర్పడకుండా ఉండేందుకు అధికారులం తా అప్రమత్తం అవుతున్నారు. ఇటు కలెక్టర్లతో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నా రు. నిజామాబాద్ జిల్లాలో 29 మండలాలకు గాను 25 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 4 మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయినట్లుగా వాతావరణ శాఖ పేర్కొం ది. తుపాన్ మూ లంగా ఉష్ణోగ్రతలు సైతం పడిపోయా యి. కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలు కాగా గ రిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డి గ్రీలుగా నమోదైంది. సో మవారం ఏర్గట్ల, కమ్మర్పల్లి, నవీపేట, మోర్తాడ్, చందూర్, ధర్పల్లిలో దాదా పు 4.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలకు 19 మం డలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.దోమకొండలో 7.8 సెం.మీ, భిక్కనూరులో 7 సెం.మీ, తాడ్వాయిలో 5 సెం.మీటర్లు చొప్పున వర్షం కురిసింది.
మరో రెండు రోజులు..
వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో గులాబ్ తుపాన్ మంగళ, బుధవారాలు కూ డా కొనసాగనున్నది. తుపాన్ ప్రభావం నిజామాబాద్, కామారెడ్డి జి ల్లాలపై ప్రభావం చూపుతుంది. ముం దస్తు అంచనాలకు తగ్గట్లుగానే ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు అడపాదడపా కురిసిన వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదను అంచనా వేస్తూ ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు వర ద గేట్లను ఎత్తిదిగువకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతా ల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పునరావసం కోసం రెవె న్యూ అధికారులు నిజామాబాద్ నగరంలో ముందస్తుగా పలు ఫంక్షన్ హాళ్ల ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. లోత ట్టు ప్రాంతాల్లో ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే సమాచారం చేరవేయాలని నగర పాలక సంస్థ అధికారులు కోరుతున్నారు. తుపాన్ గండం మొదటి రోజు గడవగా రానున్న 48 గంటలు ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన అందరిలోనూ వెంటాడుతున్నది.