ఇందూరు, అక్టోబర్ 8 : పోలీసు కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమరవాణాను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీపీ కార్తికేయ తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గంజాయి వినియోగాన్ని పూర్తిస్థాయిలో కంట్రోల్ చేసినట్లు పేర్కొన్నారు. గంజాయితో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లు, రవాణా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే సీపీ ఆఫీస్ 9491398540, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ 9440795452, స్పెషల్బ్రాంచ్ కంట్రోలర్ 9490618000 కు లేదా cpnzb1@gmail.com తెలియజేయాలని సీపీ సూచించారు.
అనుమానాస్పద వ్యక్తులపై నిఘాపెట్టాలి
బతుకమ్మ, దసరా ఉత్సవాల నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టాలని సీపీ కార్తికేయ సూచించారు. రద్దీ పేపర్లు, పూల మొక్కలు, ఇతర వస్తువులను విక్రయించే వారిపై నిఘా ఉంచాలని, రాత్రి సమయాల్లో ఎవరైనా అనుమానంగా సంచరిస్తున్నట్లు దృష్టికివస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. కాలనీల్లో గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలని, తాళం వేసి ఊరికి వెళ్తే ముందుగానే స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. ఉత్సవాలను నిబంధనల మేరకు ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.