కేపీహెచ్బీకాలనీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జడ్సీ మమత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం రోడ్ నం-1, ఏడవఫేజ్ సర్వీస్ రోడ్డుల్లో పారిశుధ్యంపై డీసీ రవికుమార్, పాజెక్ట్ ఈఈలతో కలిసి ఆమె తనిఖీలు చేశారు. సందర్భంగా కేపీహెచ్బీకాలనీ రోడ్ నంబర్-1లోని ఓపెన్ డ్రైనేజీ ప్రాంతంలో సకాలంలో వ్యర్థాలను తొలిగించకపోవడంపై ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఓపెన్ డ్రెయిన్ శుభ్రంగా లేకపోవడం విచారకరం అన్నారు. ఇకపై ఓపెన్ డ్రెయిన్లు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈ, ఏఎంహెచ్వో, శానిటరీ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.