మార్కెట్ చైర్మన్ రాజేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి
మక్తల్ టౌన్, ఏప్రిల్ 5 : చిట్టెం నర్సిరెడ్డి హైలెవల్ కెనాల్ కింద వరి పంటలు వేసుకోవద్దని అధికారులు చెప్పినా ప్రతిపక్షాల నాయకులు రై తులను తప్పుదోవ పట్టించారని మా ర్కె ట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, టీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మె ల్యే నివాసంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వరి పంటలు వేసుకోవద్దని, ఆరుతడి పం టలు వేసుకోవాలని రిజర్వాయర్ అధికారులు రై తులకు సూచించారని తెలిపారు. యాసంగి ప్రా రంభం నుంచి రైతులకు సూచించినా కూడా కొం దరు ప్రతిపక్ష నాయకులు పనిగట్టుకొని రైతులను తప్పుతోవ పట్టిం చివరి పంటలు వేసేటట్లు చేశారన్నారు. రిజర్వాయర్ సామర్థ్యం మూడు టీఎంసీలు కాగా ఒక పంటకు రెండు టీఎంసీలు కాగా ఇంకా ఒక టీఎంసీ మిగులుతుందన్నారు. మిగిలి న ఒక టీఎంసీ వరి పంటలకు సరిపోదని, అందు కే ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు రైతులకు సూచించారన్నారు. అధికారులు సూచించినప్పటికీ నేరడుగోమ్, మాద్వార్, మక్తల్, లిం గంపల్లి గ్రామాల రైతులు రిజర్వాయర్లోకి మోట ర్లు వేసి నీరు వాడుకుంటున్నారని, వారిని ప్రభు త్వం ఏమీ అనలేదని తెలిపారు. నియోజకవర్గం లో పూర్తిగా రెండు పంటలకు సాగునీరు అందించే విధంగా ఎమ్మెల్యే సీఎం కేసీఆర్తో మాట్లాడి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఊట్కూర్ చె రువును నింపుకొని మళ్లీ సంగంబండకు సాగునీ రు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రామలిం గం, వైస్ చైర్మన్ అనిల్, నాయకులు పాల్గొన్నారు.