నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
మహిత’ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు, ఆక్సీమీటర్లు పంపిణీ
నిర్మల్ టౌన్, జూలై 14: సామాజిక సేవ ద్వారానే సమాజంలో తగిన గుర్తింపు వస్తుందని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మాస్కులు, శానిటైజర్, పల్స్ ఆక్సీమీటర్లు, దుస్తు లు, సర్జికల్ మాస్క్లను అందించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత సంవత్సరం మార్చి నుంచి రాష్ట్రంలో, జిల్లాలో కరోనా ప్రభావంతో ఎంతో మంది అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కరోనా బాధితులకు చేయూతనిచ్చిన సంస్థ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు రాంకిషన్రెడ్డి, సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రమేశ్, శేఖర్రెడ్డి, సిబ్బంది సందీప్రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
నిర్మల్ అర్బన్, జులై 14 : పట్టణంలోని శివాజీచౌక్ నుంచి గాజుల్పేట్ వరకు చేపడుతున్న రోడ్డు సుందరీకరణ అభివృద్ధి పనులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి బస్టాండ్ ప్రాంతం వరకు పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్రెడ్డిని ఆదేశించారు. అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న వర్టికల్ గార్డెన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, సారంగపూర్ జడ్పీటీసీ రాజేశ్వర్రెడ్డి, కౌన్సిలర్ పూదరి రాజేశ్వర్ పాల్గొన్నారు.