అంతర్జాతీయ వ్యాపారం (ఇంటర్నేషనల్ ట్రేడ్)
1994, జూలైలో అమెరికా దేశంలో ‘న్యూ హ్యాంప్షైర్’ రాష్ట్రంలోని ‘బ్రెట్టన్ ఉడ్స్’ అనే నగరంలో 3 అంతర్జాతీయ సంస్థలను స్థాపించాలని నిర్ణయించారు. అవి.. ఐఎంఎఫ్, ఐబీఆర్డీ, ఐటీవో అమెరికన్ కాంగ్రెస్ (అమెరికా) వ్యతిరేకించడం వల్ల ఐటీవో ని స్థాపించలేదు.ఐఎంఎఫ్, ఐబీఆర్డీ స్థాపించాలనే నిర్ణయం బ్రెట్టన్ ఉడ్స్ నగరంలో జరిగినందున వీటిని బ్రెట్టన్ ఉడ్స్ కవలలు అని అంటారు.
ఐఎంఎఫ్
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్-అంతర్జాతీయ నిధి)
దీనిని 1945, డిసెంబర్ 27న స్థాపించారు. కానీ ఇది 1947, మార్చి 1 నుంచి పని ప్రారంభించింది.
దీని ప్రధాన కార్యాలయం- వాషింగ్టన్ (అమెరికా రాజధాని)
ఐఎంఎఫ్ సభ్యదేశాల సంఖ్య- 189
190వ దేశంగా అండోరా 2020, అక్టోబర్ 16న చేరింది.
ఐఎంఎఫ్ ప్రపంచ దేశాలకు స్వల్పకాలిక రుణాలను అందిస్తుంది.
ఐఎంఎఫ్ అధికార భాషలు- అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్
ప్రపంచంలో ద్రవ్యత్వ సమస్యలను నివారించడం ఐఎంఎఫ్ ముఖ్య ఉద్దేశం.
ఐఎంఎఫ్ కరెన్సీ పేరు- ఎస్డీఆర్ (స్పెషల్ డ్రావింగ్ రైట్స్)
ఎస్డీఆర్ను పేపర్ గోల్డ్ (పత్ర బంగారం) అని పిలుస్తారు.
1969లో ద్రవ్యత్వ సమస్య ఏర్పడటంతో ఈ ఎస్డీఆర్ను ప్రవేశపెట్టారు.
ఐఎంఎఫ్ అనేది ఎస్డీఆర్లను జారీచేస్తుంది (ప్రతి దేశానికి వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టిలాగా).
ఎస్డీఆర్ అనేది ఐఎంఎఫ్ యూనిట్ ఆఫ్ అకౌంట్ వంటిది.
నోట్: ఐఎంఎఫ్ వార్షిక ఆర్థిక నివేదిక అయిన ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్’ను ప్రచురిస్తుంది.
ఐబీఆర్డీ ‘వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్’ను ప్రచురిస్తుంది.
యూఎన్డీఆర్ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ రిపోర్ట్) ‘హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్’ను ప్రచురిస్తుంది.
ఐఎంఎఫ్లో సభ్యత్వం
ఒక దేశం వద్దనున్న బంగారం నిల్వలను బట్టి ఆ దేశానికి కోటా నిర్దేశిస్తారు. ఆ కోటాను ఏ దేశమైతే చెల్లిస్తుందో ఆ దేశానికి ఐఎంఎఫ్లో సభ్యత్వాన్ని కల్పిస్తారు. ఈ కోటాలో కొంత శాతం బంగారంలో చెల్లించాలి. అయితే ఈ నిబంధనను 1976లో ఎత్తివేశారు.
ఒక దేశానికి ఐఎంఎఫ్లో సభ్యత్వం వస్తే ఐబీఆర్డీలో సభ్యత్వం వచ్చినట్లే.
ఒక దేశానికి ఐఎంఎఫ్లో సభ్యత్వం రద్దయితే దానంతట అదే ఐబీఆర్డీలో సభ్యత్వం కోల్పోయినట్లే.
ఐఎంఎఫ్ సభ్యదేశాలు తమ దేశం తరఫున గవర్నర్ పంపుతుంది.
ఐఎంఎఫ్లో 21 మందితో బోర్డ్ ఆఫ్ గవర్నర్ను ఏర్పాటు చేస్తారు.
21 మందిలో 16 మందిని సభ్యదేశాల నుంచి గవర్నర్లను ఎంపిక చేయగా, మిగతా ఐదుగురిని అత్యధిక కోటాగల దేశాలు నామినేట్ చేస్తాయి.
ప్రతి గవర్నర్కు 250 ఓట్లు ఇస్తారు.
ఇది కాకుండా లక్ష ఎస్డీఆర్లకు ఒక అదనపు ఓటు కూడా కల్పిస్తారు.
లక్ష్యాలు
ద్రవ్యత్వ సహకారాన్ని పెంపొందిస్తుంది.
బీవోపీ (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్-విదేశీ వ్యాపారంలోని అసమతౌల్యం)లో వచ్చే అసమత్వాన్ని పరిష్కరించడానికి సహకరిస్తుంది.
ఎక్సేంజ్ రేట్లో అస్థిరత్వం ఏర్పడితే సుస్థిరత్వాన్ని తీసుకురావడానికి తన వంతు సహకారాన్ని అందిస్తుంది.
అంతర్జాతీయ వ్యాపార సమతౌల్యతకు సహకరిస్తుంది.
ఐఎంఎఫ్ ప్రస్తుత చైర్మన్- క్రిస్టలినా జార్జీవా (బల్గేరియా). 2019, అక్టోబర్ 1న నియమితులయ్యారు.
ఐబీఆర్డీ
దీని విస్తరణ.. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీనిని 1945, డిసెంబర్ 27న స్థాపించారు. 1946, జనవరి 1 నుంచి పని ప్రారంభించింది.
దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ
సభ్యదేశాల సంఖ్య- 189 (190)
దీని చైర్మన్- డేవిడ్ రాబర్ట్ మాల్పస్. 2019, ఏప్రిల్ 9న నియమితులయ్యారు.
అమెరికాకు చెందిన ఈయన 13వ చైర్మన్.
దీని చైర్మన్ పదవీకాలం 5 సంవత్సరాలు.
దీని మొదటి చైర్మన్- యూజిన్ మేయర్
దీనిని ప్రపంచ బ్యాంక్ అంటారు.
దీని సభ్యదేశాలకు దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది.
దీని ఒక్కో షేర్ విలువ- లక్ష డాలర్లు
దీనిలో అత్యధిక షేర్లు కలిగిన దేశాలు- అమెరికా, జపాన్, భారత్
ఐబీఆర్డీ వరల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (డబ్ల్యూడీఆర్)ను ప్రచురిస్తుంది.
గ్యాట్ (జీఏటీటీ)
జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ (జీఏటీటీ). అంటే వ్యాపార సుంకాల సాధారణ ఒడంబడిక.
1930 ఆర్థిక మాంద్య పరిస్థితుల వల్ల అంతర్జాతీయ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడింది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల రక్షణ కోసం దిగుమతి సుంకాలు విధించింది. దీనివల్ల అంతర్జాతీయ వ్యాపారం తగ్గింది.
బ్రెట్టన్ ఉడ్ సమావేశంలో ఐఎంఎఫ్, ఐబీఆర్డీలు ఏర్పడినప్పటికీ ఐటీవో ఏర్పడలేదు. అయినప్పటికీ వ్యాపారాభివృద్ధికి కొన్ని దేశాలు ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. దీని గ్యాట్ అంటారు.
1947, అక్టోబర్లో 23 దేశాలు గ్యాట్పై సంతకాలు చేశాయి. దీనిలో భారత్ ప్రారంభ దేశం.
వ్యాపారంలోని అవరోధాలను తొలగించి వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు గ్యాట్ను ప్రారంభించారు.
గ్యాట్ వ్యాపారాభివృద్ధి సభ్యదేశాల మధ్య ఒక నిరంతర చర్చావేదికను ఏర్పాటు చేసింది. గ్యాట్ రౌండ్స్ పేరుతో సభ్యదేశాలు ఎప్పటికప్పుడు సమావేశమవుతాయి.
నిబంధనలు
సుంకాలను తగ్గించడం
పరిమాణాత్మక ఆంక్షలను తొలగించడం
మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ (ఎంఎఫ్ఎన్) హోదాను అన్ని సభ్యదేశాలకు ఇవ్వడం
తగాదాల పరిష్కారం
నోట్: సభ్యదేశాల మధ్య వివక్షరహితంగా ప్రవర్తించాలని తెలిపేది ఎంఎఫ్ఎన్. అంటే ఒక దేశం మరొక దేశానికి అనుకూలం తీర్మానాలు చేస్తే ఆ తీర్మానాలు గ్యాట్లో ఉన్న అన్ని సభ్యదేశాలకు వర్తిస్తుంది. ఇది గ్యాట్లో లేని సభ్యదేశాలకు వర్తించదు.
గ్యాట్ 8 రౌండ్స్ సమావేశాలు
1) 1947- జెనీవా (స్విట్జర్లాండ్)
2) 1949- అన్నేసి (ఫ్రాన్స్)
3) 1950-51- టార్కే (ఇంగ్లండ్)
4) 1956- జెనీవా (స్విట్జర్లాండ్)
5) 1960-61- జెనీవా (స్విట్జర్లాండ్)
6) 1964-67- జెనీవా (స్విట్జర్లాండ్)
7) 1973-79- టోక్యో (జపాన్)
8) 1989-94- పుంటా డెల్ ఎస్టేట్ (ఉరుగ్వే)
1986లో 8వ రౌండ్ ఉరుగ్వేలో ప్రారంభమై 1994లో జెనీవాలో ముగిసింది.
15 అంశాలకు సంబంధించి ఈ సమావేశం జరిగింది. దీనిలో 14 అంశాలు వస్తువులకు చెందినవి. ఒక అంశం సేవలకు చెందింది. ఈ సేవలకు చెందిన ఒక అంశం వివాదాస్పదంగా మారింది.
దీంతో అప్పటి గ్యాట్ డైరెక్టర్ జనరల్ ఆర్థర్ డంకెల్ ఈ సమావేశాల్లో జరిగిన చర్చల సారాంశాన్ని ‘డంకెల్ డ్రాఫ్ట్’గా రూపొందించారు.
భారత్తో సహా 117 దేశాలు 1994, ఏప్రిల్లో మొరాకోలోని మురకేష్ నగరంలో సంతకాలు చేశాయి. ఫలితంగా 1994, డిసెంబర్ 12న గ్యాట్ రద్దు అయ్యింది. దీని స్థానంలో డబ్ల్యూటీవో అనే శాశ్వత, చట్టబద్ధమైన సంస్థ 1995, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో)
దీనిని 1995, జనవరి 1న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
దీని సభ్యదేశాల సంఖ్య- 164
దీని అధ్యక్షుడు రాబర్టో అజెవెడో. 2020, ఆగస్ట్ 31న నియమితులయ్యారు.
డబ్ల్యూటీవో మొదటి అధ్యక్షుడు- రెనాటో రుగిరో
దీని అధ్యక్షుడి పదవీకాలం- 6 సంవత్సరాలు
డబ్ల్యూటీవో అంతర్జాతీయ వ్యాపారానికి కాపలాదారు (వాచ్ డాగ్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్)గా పిలుస్తారు.
మొదటి సమావేశం సింగపూర్లో 1996లో జరిగింది.
రెండోది- జెనీవా (1998)
మూడోది- అమెరికాలోని సియాటెల్ (1999)
నాలుగోది- దోహా (2001)
ఐదోది- మెక్సికోలోని కాన్కున్ (2003)
ఆరోది- హాంకాంగ్ (2005)
ఏడోది- జెనీవా (2008, జూలై 21-29)
ఎనిమిదోది- జెనీవా (2011, డిసెంబర్)
తొమ్మిదోది- బాలి (2013, డిసెంబర్)
పదోది- కెన్యాలోని నైరోబీ (2015)
పదకొండోది- అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ (2017, డిసెంబర్ 11-14)
దీని అధికార భాషలు- ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్
దీని అధ్యక్షురాలు (డైరెక్టర్ జనరల్)- ఎన్జోజి ఒకాంజో ఇవెలా. ఈమె 2021, మార్చి 1న నియమితులయ్యారు.
నీతి ఆయోగ్పై ప్రాక్టీస్ బిట్స్
1. నీతి ఆయోగ్ ఏ భాషాపదం?
1) తెలుగు 2) హిందీ
3) ఇంగ్లిష్ 4) అరబిక్
2. నీతి ఆయోగ్ని విస్తరించండి?
1) నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా
2) నేషనల్ ఇన్స్ట్యిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా
3) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రేడ్ ఇండియా
4) నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా
3. నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు?
1) ప్రధాని 2) రాష్ట్రపతి
3) గవర్నర్ 4) ముఖ్యమంత్రి
4. నీతి ఆయోగ్ను ఏడేండ్ల కాలానికి రూపొందించే ప్రణాళికను ఏమంటారు?
1) విజన్ 2) యాక్షన్ ఎజెండా
3) వ్యూహాత్మక ప్రణాళిక
4) సలహామండలి
5. నీతి ఆయోగ్ నినాదం ఏమిటి?
1) సబ్ కా సాత్ – సబ్ కా వికాస్
2) దేశాభివృద్ధి 3) రాష్ర్టాభివృద్ధి
4) జిల్లాల అభివృద్ధి
6. నీతి ఆయోగ్ కార్యాచరణ 3 సంవత్సరాల కాలానికి రూపొందిస్తే దానిని ఏమంటారు?
1) విజన్ 2) యాక్షన్ ఎజెండా
3) వ్యూహాత్మక ప్రణాళిక
4) సలహామండలి
7. నీతి ఆయోగ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1) 2019, మే 1
2) 2015, ఏప్రిల్ 1
3) 2015, జనవరి 1
4) 2015, ఆగస్ట్ 15
8. నీతి ఆయోగ్ కార్యాచరణ 15 సంవత్సరాల కాలానికి రూపొందిస్తే దానిని ఏమంటారు?
1) సలహామండలి
2) వ్యూహాత్మక ప్రణాళిక
3) యాక్షన్ ఎజెండా 4) విజన్
9. కింది వాటిలో సరికానిది?
1) కీలకమైన విధాన నిర్ణయాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వాలకు వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను అందిస్తుంది నీతి ఆయోగ్
2) నీతి ఆయోగ్ పరస్పర సహకారం అనే విధానంపై ఆధారపడి పనిచేస్తుంది
3) నీతి ఆయోగ్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన విధానాలు, వ్యూహాలను రూపొందించడం వల్ల థింక్ జంక్ (మేధోసంపత్తి కేంద్రం) అని అంటారు
4) పైవన్నీ సరైనవే
10. బలమైన రాష్ర్టాలతో బలమైన దేశం అని సూచించిన సంస్థ?
1) ప్రణాళిక సంఘం 2) నీతి ఆయోగ్
3) ఎన్డీసీ 4) ఎన్ఎస్ఎస్వో
11. నీతి ఆయోగ్ మొదటి పాలక మండలి సమావేశం ఎప్పుడు జరిగింది?
1) 2015, జనవరి 1
2) 2015, ఏప్రిల్ 1
3) 2015, ఫిబ్రవరి 8
4) 2015, మార్చి 15
12. ప్రణాళిక సంఘం కేంద్రీకృత ప్రణాళిక ధోరణిని కలిగి ఉంటే నీతి ఆయోగ్ ఏ విధానాన్ని కలిగి ఉంటుంది?
1) సమీకృత 2) సాంకేతిక
3) వికేంద్రీకృత 4) 1, 2
13. నీతి ఆయోగ్ను ఏ తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు?
1) కేంద్ర మంత్రిమండలి
2) జాతీయాభివృద్ధి మండలి
3) 1, 2 సరైనవి 4) 2 సరైనదికాదు, 1 సరికాదు
14. ప్రణాళిక సంఘం ఎగువ నుంచి దిగువకు అనే విధానాన్ని అనుసరించగా, దిగువ నుంచి ఎగువకు అనే విధానాన్ని అమలు చేస్తున్నది ఏది?
1) ఎన్ఎస్ఎస్వో సంస్థ
2) సీఎస్వో సంస్థ
3) నీతి ఆయోగ్ 4) 1, 2 సరైనవి
15. ప్రణాళిక సంఘంలో పూర్తికాల సభ్యులు 4 నుంచి 7 గరిష్టంగా ఉంటే, నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యులు గరిష్టంగా ఎంతమంది ఉంటారు?
1) 4 2) 6 3) 7 4) 5
16. నీతి ఆయోగ్ మొదటి ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా. ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు?
1) అమితాబ్కాంత్ 2) రాజీవ్కుమార్
3) రమేష్చంద్ 4) వీకే సారస్వత్
17. నీతి ఆయోగ్ మొదటి సీఈవో సింధుశ్రీ కుల్లార్. ప్రస్తుత సీఈవో?
1) వీకే సారస్వత్ 2) రాజీవ్కుమార్
3) అమితాబ్కాంత్ 4) రమేష్చంద్
18. నీతి ఆయోగ్లో పూర్తికాలం కాని సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత?
1) 3 2) 5 3) 4 4) 2
19. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు?
1) రాష్ట్రపతి 2) ముఖ్యమంత్రి
3) ప్రధాని 4) గవర్నర్
20. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులు కింది వారిలో ఎవరు?
1) అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు
2) అన్ని రాష్ర్టాల గవర్నర్లు
3) అన్ని కేంద్ర పాలి ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు
4) పైవన్నీ సరైనవే
Answers
1-2, 2-3, 3-1, 4-3, 5-1, 6-2, 7-3, 8-4, 9-4, 10-2, 11-3, 12-3, 13-1, 14-3, 15=4, 16-2, 17-3, 18-4, 19-3, 20-4.
సంతోష్
విషయ నిపుణులు ,కరీంనగర్