లండన్ : బ్రిటన్కు చెందిన షెఫీల్డ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్ విదేశీ విద్యార్ధులు సహా విద్యార్ధులందరికీ (MBA Students) రూ. 10.52 లక్షల చొప్పున స్కాలర్షిప్ను ప్రకటించింది. 2024 సెప్టెంబర్ సీజన్కు తమ విద్యా సంస్ధలో ఎంబీఏ కోర్సులో చేరగోరు విద్యార్ధులకు ఈ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నామని షెఫీల్డ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్ ఓ ప్రకటనలో పేర్కొంది.
అత్యున్నత విద్యా ప్రమాణాలను సాధించిన విధ్యార్ధులు స్కాలర్షిప్కు అర్హులని యూనివర్సిటీ పేర్కొంది. ఫుల్ టైం ఎంబీఏ ప్రోగ్రామ్లో చేరినవారు ఆటోమేటిక్గా ఈ స్కాలర్షిప్కు ఎంపికవుతారని వెల్లడించింది.
అభ్యర్ధి దరఖాస్తు, వ్యక్తిగత ప్రకటన అడ్మిషన్ల బృందంచే మూల్యాంకనం చేయబడుతుందని విశ్వవిద్యాలయం పేర్కొంది. మొత్తం స్కోర్ని నిర్ణయించడానికి ఎంబీఏ అడ్మిషన్స్ స్టాఫ్తో ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థుల సామర్ధ్యం ఆధారంగా కూడా వారిని అంచనా వేస్తారని వర్సిటీ తెలిపింది.
Read More :
Deloitte | డెలాయిట్ కీలక నిర్ణయం : ఏఐ సాయంతో మాస్ లేఆఫ్స్కు చెక్