హైదరాబాద్: టీఎస్ లాసెట్ ప్రవేశపరీక్ష-2021(TS Lawcet) ఫలితాలు విడుదలయ్యాయి. మూడేండ్ల న్యాయ విద్య కోర్సుకు 28,877 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 21,160 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. కాగా 14,017 మంది (66.24 శాతం) మాత్రమే కోర్సులో ప్రవేశాలకు అర్హత సాధించారు. అలాగే ఐదేండ్ల న్యాయ విద్య (బీఏ, బీకాం, బీబీఏ, ఎల్ఎల్బీ) కోసం 7,644 మంది దరఖాస్తు చేయగా అందులో 5,793 మంది (66.39 శాతం) పరీక్షకు హాజరయ్యారు.
అయితే పీజీ ఎల్సెట్ (PG Lcet)కు 3,284 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,676 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 2,535 మంది (94.73 శాతం) ప్రవేశాలకు అర్హత సాధించారు. లాసెట్తోపాటు పీజీఎల్ సెట్కు 39,805 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 29,629 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 20,398 మంది అర్హత (68.84 శాతం) సాధించారు.