వరంగల్ : టీఎస్ ఐసెట్-2022 నోటిఫికేషన్ను కాకతీయ విశ్వవిద్యాలయం బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ. 250 అపరాధ రుసుంతో జులై 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 4న ఐసెట్ ప్రాథమిక కీ, ఆగస్టు 22న తుది ఫలితాలను విడుదల చేయనున్నారు.