తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీసెట్- 2026) ఫలితాలు మంగళవారం ప్రకటించనున్నట్టు ఎస్సీ గురుకులాల సొసైటీ అధికారులు వెల్లడించా రు. మంగళవారం మధ్యాహ్నం 1:30గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఫలితాలు విడుదల చేస్తారని వివరించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో, 6నుంచి 9వ తరగతుల వరకు మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష నిర్వహించగా, మొత్తంగా 1,82,061 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 1,72,842 మంది హాజరయ్యారు.