JEE Main 2024 | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 దరఖాస్తుల గడువును డిసెంబర్ 4 వరకు పొడిగించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. తొలి విడత దరఖాస్తుల గడువు గురువారం ముగియగా, మరోసారి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొన్నది.
డిసెంబర్ 6 నుంచి 8 వరకు దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు. జేఈఈ మెయిన్ -1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్కు 8.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. తాజా గడువు పెంపుతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరగనున్నది.