న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 210 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 210
అర్హతలు: డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్లో ఇంగ్లిష్లో నిమిషానికి 35 పదాలు టేప్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లిష్ టైపింగ్ పరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీహెచ్ అభ్యర్థులకు రూ.250
దరఖాస్తులకు చివరితేదీ: జులై 10
వెబ్సైట్: www.sci.gov.in