హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్ ) రెండో విడత సీట్లను ఈ నెల 27న కేటాయించనున్నారు. మొదటి విడతగా ఇప్పటివరకు 86,185 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. మొదటి, రెండో విడతలో మొత్తం 52,670 మంది విద్యార్థులు వెబ్ఆప్షన్లు ఎంచుకున్నారు. వీరికి సీట్లను కేటాయించనుండగా, సెప్టెంబర్ 10 లోపు సెల్ఫ్రిపోర్టింగ్కు గడువు విధించారు. ఈ నెల 29 నుంచి మూడో విడత వెబ్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబర్12 వరకు రిజిస్ర్టేషన్, వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. 16న సీట్లు కేటాయిస్తారు. అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
జులై 1న దోస్ట్ విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. జులై 6 నుంచి 30 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోగా, ఆగస్టు 6న సీట్లు కేటాయించారు. ఈ నెల 21 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్కు అవకాశం ఇచ్చారు. కాగా, దోస్త్ ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1060 కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో సుమారు 4 లక్షల 25 సీట్లను భర్తీ చేయనున్నారు.