ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 19 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్ష ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని స్పెషలైజేషన్ల ఎంఫార్మసీ (పీసీఐ) మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష ఫీజును ఈ నెల 27వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని ఆయన తెలిపారు.