న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రతిఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనాలనుకునేవారికి కేంద్ర విద్యా శాఖ మరో అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 27 వరకు పొడిగించింది. పరీక్షలకు ముందు విద్యార్థుల్లో భయాందోళనలను తొలగించడానికి ప్రధాని మోదీ 2018 నుంచి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం జరగనున్న ఐదో ఎడిషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గతేడాది డిసెంబర్ 28న ప్రారంభమయింది. ముందుగా జనవరి 20 వరకు గడువు ఇచ్చారు. అయితే దరఖాస్తు గడువు మరో వారం రోజులపాటు పొడిగించారు. కరోనా నేపథ్యంలో గతేడాది నుంచి ఈ కార్యక్రమం వర్చువల్ పద్ధతిలోనే జరగుతున్నది.
పరీక్షలు రాయనున్న తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులల్లో భయాందోళనలను తొలగించడానికి 2018లో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిని ప్రభుత్వం దూరదర్శన్, ఆకాశవాణిలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.