న్యూఢిల్లీ: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు వచ్చే నెల 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 864 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మెకానికల్ ఇంజీనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. గేట్-2022లో అర్హత సాధించిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 864
ఇందులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 280 ఖాళీలు, మెకానికల్ ఇంజినీరింగ్ 360, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 164, సివిల్ ఇంజినీరింగ్ 30, మైనింగ్ ఇంజినీరింగ్లో 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో గేట్-2022 అర్హత సాధించి, 27 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్ 2022 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 11
వెబ్సైట్: https://ntpc.co.in