న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ (NTPC) లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 177 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో మైనింగ్ సిర్దార్, మైనింగ్ ఓవర్మ్యాన్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 177
ఇందులో మైనింగ్ సిర్దార్ 103, మైనింగ్ ఓవర్మ్యాన్ 74 చొప్పున ఖాళీలు ఉన్నాయి
అర్హతలు: మైనింగ్ ఓవర్మెన్ పోస్టులకు ఇంజినీరింగ్లో డిప్లొమాపూర్తిచేసి, ఓవర్మ్యాన్ సర్టిఫికెట్ కలిగిఉండాలి. మైనింగ్ సిర్దార్ పోస్టులకు పదో తరగతి పాసవ్వాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.300
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 15
వెబ్సైట్: www.ntpc.co.in