న్యూఢిల్లీ: వ్యవసాయ కోర్సుల్లో యూపీ, పీజీ, జేఆర్ఫ్, పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చురల్ రిసెర్చ్ (ఐకార్) ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ (ఏఐఈఈఏ) నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నది. ఈ పరీక్ష ద్వారా 75 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఇందులో 64 రాష్ట్రీయ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చురల్, ఫిషరీస్ వర్సిటీలు, 4 ఐసీఏఆర్ డీమ్డ్ యూనివర్సిటీలు, 3 సెంట్రల్ అగ్రికల్చురల్ యూనివర్సిటీలు, 4 సెంట్రల్లు యూనివర్సిటల్లోని వ్యవసాయ కోర్సుల్లో డిగ్రీ, పీజీ, ఏఐసీఈ జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష పేరు: ఏఐఈఈఏ
అర్హత: యూజీ కోర్సులకు 10+2 ఉత్తీర్ణ సాధించి 16 ఏండ్లు నిండినవారై ఉండాలి. మిగిన వాటికి సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ రాతపరీక్ష ద్వారా. యూజీ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా 178 నగరాలు, మిగిలినవాటికి 89 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 20
అడ్మిట్ కార్డుల విడుదల: సెప్టెంబర్లో
పరీక్ష తేదీలు: యూజీ- సెప్టెంబర్ 7, 8, పీజీ, పీహెచ్డీ- సెప్టెంబర్ 17
ఫలితాల విడుదల: అక్టోబర్లో
వెబ్సైట్: icar.nta.nic.in