డిగ్రీలో ప్రవేశాలంటే ఇది వరకు ప్రహసనం. దరఖాస్తులు కొనుక్కుని, పూరించి, సర్టిఫికెట్లు జోడించి సమర్పించాలి. మొదటి లిస్ట్, రెండో లిస్ట్, మూడో లిస్ట్, ఆఖరుకు స్పాట్ అడ్మిషన్లు. ఇలా కాలేజీ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇలాంటి అవస్థలకు చెక్పెడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) విద్యార్థుల సమస్యలన్నింటిని దూరం చేసింది. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేకుండా ఎంచక్కా ఇంట్లో ఉండే డిగ్రీలో ప్రవేశాలు పొందవచ్చు. దోస్త్-2021 నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొదటి విడుత ప్రవేశాల్లో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, ఇప్పటి వరకు 78,818 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రితో ముఖాముఖి.
కాకతీయ, ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, మహత్మాగాంధీ,
శాతవాహన విశ్వవిద్యాలయాలు
కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం
1046 కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు (వీటి సంఖ్య మారవచ్చు)
రిజిస్ట్రేషన్లు (జూలై 7 వరకు)
–కొంటు మల్లేశం, నమస్తే తెలంగాణ ప్రతినిధి