హైదరాబాద్ : బీఎస్సీ(నర్సింగ్)లో ప్రవేశాల కోసం నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) దరఖాస్తులను ఆహ్వానించిన విషయం విదితమే. ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 28న సనత్నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నిమ్స్ యాజమాన్యం ప్రకటించింది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. కానీ అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 8:30 గంటల వరకు చేరుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను నిమ్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.