న్యూఢిల్లీ: కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని స్వతంత్ర సైంటిఫిక్ సొసైటీ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తు గడువు ఈనెల 22న ముగుస్తున్నది. దీంతో ఇప్పటికీ దరఖాస్తు చేసుకోనివారు అప్లయ్ చేయాలని కోరింది. ఎంపికైనవారు పంజాబ్లోని రోపార్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 24
ఇందులో డాటా ఎంట్రీ ఆపరేటర్ 20, కంప్యూటర్ ఆపరేటర్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి, నిర్ణీత స్పీడ్లో టైప్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
వెబ్సైట్: nielit.gov.in/chandigarh