న్యూఢిల్లీ: నీట్ యూజీ (NEET UG) కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఈనెల 25న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభం కానుంది. మేరకు ఎంసీసీ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి నీట్ యూజీ ప్రవేశ పరీక్షను జూలై 17న నిర్వహించింది.
దేశవ్యాప్తంగా 17 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలను ఈ నెల 7న ఎన్టీఏ విడుదల చేసింది. ఇందులో 9,93,069 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఇందులో 429160 మంది బాలురు, 563902 మంది బాలికలు, ఏడుగురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. నీట్ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా 91,415 ఎంబీబీఎస్, 27,948 బీడీఎస్, 52,720 ఆయుష్, 487 బీఎస్సీ నర్సింగ్, 603 బీవీఎస్సీ, 1205 ఎయిమ్స్ ఎంబీబీఎస్, 200 జిప్మర్ ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేస్తారు.