NEET | హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : 2024 -25 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల క్యాలెండర్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలను వెల్లడించింది. జేఈఈ మెయిన్ను ఏటా రెండుసార్లు నిర్వహించనుండగా, మెయిన్-1 సెషన్ను జనవరి, ఫిబ్రవరి మాసాల్లో, మెయిన్ -2 సెషన్ను ఏప్రిల్లో నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది.
మార్చి..ఏప్రిల్లోనే ఎంసెట్
రాష్ట్రంలో ఎంసెట్ను మార్చి, ఏప్రిల్ మాసాల్లో నిర్వహించే అవకాశాలున్నాయి. మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్లో జేఈఈ మెయిన్ -2పరీక్షలున్నాయి. ఈ రెండు పరీక్షల మధ్య నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించే యోచనలో అధికారులు ఉన్నారు.