హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షల రీ షెడ్యూల్ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఇందులో భాగంగా బీటెక్, బీఫార్మసీ తృతీయ, ఫైనలియర్ పరీక్షల తేదీలను వర్సిటీ ప్రకటించింది. మూడో సంవత్సరం, ఫైనలియర్లోని మొదటి సెమిస్టర్ విద్యార్థులకు వచ్చేనెల 1 నుంచి 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు మార్చి 25-27 వరకు జరగాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదాపడిన విషయం తెలిసిందే. కాగా, బీటెక్, బీఫార్మసీ ఫైనలియర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు వచ్చేనెల 5 నుంచి 14 వరకు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.