JEE Main | దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ లేదా బీఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్-2022 తొలి సెషన్ కోసం దరఖాస్తు గడువు సోమవారం (2022, ఏప్రిల్ 25) తో ముగియనున్నది. ఆసక్తి గల అభ్యర్థులు జేఈఈ మెయిన్-2022 జూన్ సెషన్ కోసం అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్-2022 కోసం అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ఇలా
అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inకు వెళ్లాలి.
హోం పేజీలో రిజిస్ట్రేషన్ ఫర్ జేఈఈ మెయిన్ 2022 అని ఉన్న లింక్ను క్లిక్ చేయాలి.
మీ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ కావాలి.
జేఈఈ మెయిన్ 2022 ఫామ్ పూర్తి చేసి, అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి
ఫీజు చెల్లించి, ఫామ్ సబ్మిట్ చేయాలి.
ఫామ్ ప్రింట్ తీసుకోవడం కోసం డౌన్లోడ్ చేసుకోవాలి.
జేఈఈ మెయిన్-2022 ఫస్ట్ సెషన్ రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంచిన లింక్ను నేరుగా అభ్యర్థులు క్లిక్ చేయొచ్చు.
జనరల్ క్యాటగిరీ విద్యార్థులు అప్లికేషన్ ఫీజు రూ.600 చెల్లించాలి. అన్ని క్యాటగిరీల విద్యార్థులు అప్లికేషన్ ఫీజు రూ.325 పేమెంట్ చేయాలి.
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సోమవారం రాత్రి 9 గంటలకు జేఈఈ మెయిన్ 2022 తొలి సెషన్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. తొమ్మిది గంటల్లోపు రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి రాత్రి 11.50 గంటల వరకు టైం ఉంటుంది. జేఈఈ మెయిన్ 2022 తొలి సెషన్ పరీక్షలు జూన్ 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28,29 తేదీల్లో జరుగుతాయి.