న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కల్పనకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main) దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి కలిగి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు వెంటనే చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తులు మార్చి 1న ప్రారంభమయ్యాయి.
ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్ను రెండు దశల్లో నిర్వహించాలని విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించిన విషయం తేలిసింది. ఈ నేపథ్యంలో మెయిన్ మొదటివిడుత పరీక్ష ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు, రెండో విడుత మే 24 నుంచి 29 వరకు జరుగనుంది. పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహిస్తారు.